APSSDC Job Fair 2022 || 21న జాబ్ మేళా | 10వ తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ నిరుద్యోగ అధ్యార్థులు అర్హులు || పూర్తి వివరాలివే..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడానికి రేపు అనగా 21.01.2922 నా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నది. నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి టి.హెచ్.విన్సెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టువంటి ఈ ఉద్యోగ మేళాకు ప్రముఖ కంపెనీలైన టువంటి కియా మోటార్స్, టాటా స్కై, బిఎంఎస్ సెక్యూరిటీ మరియు భారత్ ఎఫ్ఐ హెచ్ లిమిటెడ్ (స్టార్ మొబైల్స్) కంపెనీలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. కియా మోటార్స్ కంపెనీ లో టెక్నీషియన్ గా పని చేయుటకు, డిప్లమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు.. బిఎంఎస్ సెక్యూరిటీస్ లో, పాణ్యం సిమెంట్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేయుటకు, టాటా స్కై కంపెనీ లో, రైటింగ్ స్టార్ కంపెనీ, శ్రీ సిటీ లో పనిచేయుటకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, నగర పంచాయతీ కమిషనర్ రమేష్బాబు తెలిపారు. కావున ఇట్టి సదావకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులు ఈ