TS EDCET 2021 || బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ పూర్తి వివరాలివె..
TS EDCET - 2021
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన TS EDCET (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) - 2021, నోటిఫికేషన్ విడుదలైనది.
ఈ ప్రవేశ పరీక్ష 'కంప్యూటర్ బేస్డ్ టెస్ట్' (CBT) రూపంలో ఉంటుంది.
● ఈ పరీక్ష హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
● వచ్చే విద్యా సంవత్సరానికి (2021-2011) బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష లో అన్ని మేథడాలజీలకు ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది.
● ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు ఈ పేజీ చివరిలో ఉన్నాయి చూడండి.
పరీక్ష: TS EDCET - 2021
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)
కాల వ్యవధి: రెండు సంవత్సరాలు
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అవి బీఏ, బీకామ్, బీఎస్సి, బీఎస్సి(హోమో సైన్స్), బీసీఏ, బీబీయం, బీఏ(ఓరియంటల్ లాంగువేజ్), బీబీఏ(మాస్టర్ డిగ్రీ, సెక్యూరింగ్), బ్యాచిలర్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ మొదలగునవి.
◆ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఐతే చాలు.
◆ అయితే ఎంబీబీఎస్/ బీఎస్సి(అగ్రి)/బీవిఎస్సి/ బీహెచ్ఏంటి/ బీఫార్మసీ తో ఎల్ ఎల్ బీ డిగ్రీ ఉత్తీర్ణులైన టువంటి అభ్యర్థులు బీఈడీ కోర్సులలో చేరడానికి అనర్హులు.
వయసు: జూలై 1 2021 నాటికి అభ్యర్థులకు 19 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
సబ్జెక్టులు సిలబస్ అంశాలు:
◆ మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టం, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జామిడి, మెన్సురేషన్, త్రికోణమితి, డేటా హ్యాండ్లింగ్, మొదలగు అంశాలనుండి నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ సైన్స్(ఫిజికల్/ బయాలజీ): ఆహారం, జీవరాశులు, జీవ ప్రక్రియలు, జీవ వైవిధ్యం, కాలుష్యం, పదార్థం, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, హిట్, ధ్వని, చలనం, వాతావరణం, కాల్ అండ్ పెట్రోల్, స్టార్స్ అండ్ సోలార్ సిస్టం, మెటలర్జీ, రసాయన చర్యలు మొదలైన అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ సోషల్ స్టడీస్: జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
◆ టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు, టీచింగ్ లెర్నింగ్ క్లాసెస్, క్లాస్ రూమ్ అర్థం చేసుకోవడానికి సంబంధించినవి. మరియు టీచర్ విద్యార్థి సంబంధానికి రిఫరెన్స్. మేనేజ్మెంట్ అండ్ మోటార్ ఇన్ మొదలగు అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ జనరల్ ఇంగ్లీష్: రీడింగ్ కాంప్రెహెన్షన్, స్పెల్లింగ్ దోషాలు, పదజాలం, పద సంబంధం, రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ బోర్డ్ అసోసియేషన్ మొదలైన అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
◆ జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్: కరెంట్ అఫైర్స్(ఇండియా అండ్ ఇంటర్నేషనల్) వర్తమాన విద్యాసంబంధ అంశాలమీద ప్రశ్నలు వస్తాయి.
◆ కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్-ఇంటర్నెట్, మెమరీ, నెట్వర్కింగ్, కంప్యూటర్ బేసిక్ ఫండమెంటల్ నుండి ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్(మల్టిపుల్ ఛాయిస్) లో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. 10వ తరగతి, రాష్ట్ర స్థాయి సిలబస్ (సబ్జెక్ట్/ కంటెంట్) నుండి ప్రశ్నలు వస్తాయి.
★ మ్యాథమెటిక్స్ నుండి -20 ప్రశ్నలు,
★ సైన్స్(ఫిజికల్ సైన్స్& బయాలజికల్ సైన్స) నుండి -20 ప్రశ్నలు,
★ సోషల్ స్టడీస్ నుండి - 20 ప్రశ్నలు ఇలా ఈ మూడు విభాగాల నుండి మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి.
★ టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి -20 ప్రశ్నలు,
★ జనరల్ ఇంగ్లీష్ నుండి - 20 ప్రశ్నలు,
★ జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుండి - 30 ప్రశ్నలు, మరియు
★ కంప్యూటర్ అవేర్నెస్ నుండి -20 ప్రశ్నలు వస్తాయి.
● ప్రశ్నాపత్రం ఇంగ్లీష్/ తెలుగు, ఇంగ్లీష్/ ఉర్దూ మీడియంలో ఉంటుంది.
● ఈ అర్హత పరీక్షలో అర్హత సాధించాలంటే ఇతరులు కనీసం 25 శాతం (38 మార్కులు) సాధించాలి.
● ఎస్సీ ఎస్టీ లకు కనీస మార్కుల నిబంధన వర్తించదు.
● దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
● దరఖాస్తు ఫీజు: రూ. 650/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 450/-
● దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.04.2021 నుండి
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ:
● ఎటువంటి లేట్ పి లేకుండా: 15.06.2021 నుండి 22.06.2021 వరకు పొడిగించారు.
●●●బీఈడీ కళాశాలలో ప్రవేశాల గడువు మరొకసారి 22.06.2021 నుండి 30.06.2021 వరకు పొడిగించారు●●●
● రూ.250/- లేట్ ఫీ తో: 25.06.2021
● రూ. 500/- లేట్ ఫీ తో: 05.07.2021
●రూ. 1000/- లేట్ పీ తో: 20.07.2021
● TS EDCET - 2021 ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ: 24.08.2021(మంగళవారం).
● ఉదయం: 10:00 నుండి 12:00 వరకు
● మధ్యాహ్నం: 03:00 నుండి 05:00 వరకు
28.05.2021(బుధవారం)
● ఉదయం: 10:00 నుండి 12:00 వరకు
TS EDCET - 2021 ప్రవేశ పరీక్ష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని క్రింది ప్రాంతీయ ఆన్లైన్ పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుంది.
1. అదిలాబాద్
2. హైదరాబాద్ సెంట్రల్
3. హైదరాబాద్ ఈస్ట్
4. హైదరాబాద్ నార్త్
5. హైదరాబాద్ సౌత్-ఈస్ట్
6. హైదరాబాద్ వెస్ట్
7. నల్లగొండ
8. కోదాడ
9. ఖమ్మం
10. సత్తుపల్లి
11. కరీంనగర్
12. మహబూబ్ నగర్
13. సిద్దిపేట్
14. నిజామాబాద్
15. వరంగల్
16. నర్సంపేట్
17. పాల్వంచ
18. కర్నూల్
19. విజయవాడ.
అదికారిక వెబ్ సైట్ లింక్: https://edcet.tsche.ac.in/
ఎడ్సెట్ -2021 సిలబస్ లో మార్పులివే..
● ఎడ్సెట్ -2021 నోటిఫికేషన్ విడుదలైనది..
● అన్ని మెథడ్స్వారికి ఏకీకృత సిలబస్తో పేపర్
● మూడు మెథడ్స్ కు 20 చొప్పున 60 మార్కులు
● కొత్తగా కంప్యూటర్, వర్తమాన
విద్యాంశాల చేర్పు
● పదోతరగతి పాఠ్యాంశాల స్థాయివరకే పరీక్ష
● ఉన్నత విద్యామండలి టెస్ట్ కమిటీ నిర్ణయం జీవో-18లో మార్పుల తర్వాత అమలు
బీఈడీ - 2021 కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష సిలబస్ను సమూలంగా మార్చాలని ఉన్నతవిద్యా మండలి నిర్ణయం చేసింది. ఇప్పటివరకు ఉన్న మెథడ్స్ (బోధనాశాస్త్రం)ను రద్దుచేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. గణితం, సైన్స్, సోషల్ తదితర అన్ని మెథడ్స్వారికి ఒకే సిలబస్తో పరీక్ష నిర్వహించాలని ప్రతి ప్రాదించారు. సిలబస్లో పార్యాంశాల స్థాయిని కూడా తగ్గించారు. ప్రస్తుతం డిగ్రీ స్థాయివరకు సిలబుస్ ఆదారంగా ప్రశ్నలు అడుగుతుండగా ఈ సంవత్సరం ఎడ్సెట్లో మాత్రం 1-10 తరగతుల పాఠ్యాంశాల నుండి ప్రశ్నలు అడుగనున్నారు. ఎడ్సెట్ టెస్ట్ కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధక్షత వర్చువల్ మాధ్యమంలో నిర్వహించారు. ఎడ్సెట్ కన్వీనర్ ప్రాఫెసర్ రామకృష్ణ సహా ఇతర కమిటీ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో ఎజెండాలోని 11 అంశాలపై విస్తృతంగా చర్చించారు.
కొత్తగా మరికొన్ని అంశాలు:
● బీఈడీలోని సాంఘికశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం,
జీవాస్త్రం, ఇంగ్లిష్ మెథడ్స్వారీగా వేర్వేరు పేపర్లకు
ప్రస్తుతం ఎడ్సెట్లో వేర్వే రుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
● తాజా మార్పులతో ఏ మెధడ్వా రైనా అన్ని మెధడ్స్ను
చదవాల్సి ఉంటుంది.
● వాటితోపాటు పరీక్ష సిలబస్లో కొత్తగా
విద్యాసంబంధ అంశాలు, కంప్యూటర్ అవేర్ నెస్ అంశాలను చేర్చారు.
● ఇగ్నో, దిభ్రూగఢ్ తదితర యూనివర్శిటీల్లో
ఈ విధానం అమలవుతున్నది.
● మన దగ్గర కూడా ఇదే విధానాన్ని తీసుకురావాలని
అధికారులు నిర్ణయించారు పరీక్ష పాత పద్ధ తిలోనే 120 నిమిషాల్లో 150 మార్కులకు
ఉంటుంది.
● అయితే, ప్రశ్నలు నేరుగా కాకుండా,
సివిల్స్, గ్రూప్స్ తరహాలో రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్రతిలో
ఉండనున్నాయి.
● ఎడ్సెట్ - 2021 ప్రవేశ పరీక్ష సిలబస్లో మార్పులు చేసినప్పటికీ
బీఈడీ ప్రవేశాలు మాత్రం మెథడ్స్,
వాటికి కేటాయించిన సీట్ల ప్రకారమే జరగనున్నాయి.
● ఎడ్సెట్ ప్రవేశాల కోసం గతంలో జారీచేసిన జీవో 18లో మార్పులు చేసిన తర్వాతే తాజా నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ఉన్నత విద్యామండలి అధి కారులు తెలిపారు.
మార్పులు ఇవీ..
● ఎడ్సెట్ పేపర్లో ఇప్పటివరకు జనరల్ ఇంగ్లిష్ కు 25 ప్రశ్నలు ఉండగా వాటిని 20కి తగ్గించారు.
● జనరల్ నాలెడ్జ్ కు 15 ప్రశ్నలు ఉండగా, వర్తమాన
విద్యాసంబంధ అంశాలను కూడా చేర్చి 30 ప్రశ్నలకు పెంచారు.
● టీచింగ్ అప్టిట్యూడ్లో ఇదివరకు 10 ప్రశ్నలుండగా 20కి పెంచారు.
● ఒక్కో మెధడ్కు 100 ప్రశ్నలుండగా, 20 ప్రశ్నల చొప్పున మూడు మెథడ్స్ కు కలిపి 60 ప్రశ్నలు ఇస్తారు.
విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment