Mega Job Mela 2022 | ఈ నెల 31న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రలల్లో జాబ్ మేళా ప్రకటన విడుదల | నేరుగా ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక | పూర్తి వివరాలివే...
ఈ నెల 31నా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలల్లో మెగా జాబ్ మేలా.. వివరాలివే..
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ నెల 31వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపాయి. ఈ జాబ్ మేళా లో వివిధ కంపెనీలు పాల్గొని నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజీ, ఎంబీఏ, ఎంబీఏ.. ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చు.
ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం ఈ క్రింద తెలిపిన వివరాల ను పరిశీలించండి.
జాబ్ మేళా నిర్వహిస్తున్న రాష్ట్రాలు:
1. తెలంగాణ, 2. ఆంధ్ర ప్రదేశ్.
1. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ ఈ నెల 31న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళా లో ప్రముఖ ఫ్లిప్కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహబూబాబాద్ జిల్లాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా పని చేయడానికి పదవ తరగతి/ ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి శ్రీ ఆర్.డి.యస్. వి. రామకృష్ణ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తన బయోడేటా, ఆధార్ కార్డు తీసుకొని తేదీ:31.01.2022 న మహబూబాబాద్ లోని జిల్లా ఉపాధి కార్యాలయం లో జరుగు జాబ్ మేళా కు హాజరు ఐ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి/ ఇంటర్మీడియట్ విద్యతో పాటు, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండవలెనన్నారు.
ఈ నెల 31న మహబూబాబాద్ లో జోబ్ మేలా pic.twitter.com/DOBJuuLjmc
— Dasarath M (@LearningBADI) January 30, 2022
ఖాళీలు: 20.
పని చేయవలసిన ప్రదేశం: మహబూబాబాద్ జిల్లా.
జీతం: ₹.14,000-18,000/-.
2. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా, నెల్లూరు జిల్లాలో ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31న గుంటూరు జిల్లాలోని ప్లానెట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి బాజీ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్బిఐ కార్డ్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు బయో-డేటా, సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, కాఫీలతో పాస్పోర్ట్ ఫోటోలతో, ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
ఈ నెల 31న గుంటూరులో స్కిల్ల్ కనెక్ట్ డ్రైవ్ pic.twitter.com/ujugheqErR
— Dasarath M (@LearningBADI) January 30, 2022
అమరావతి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న ప్లానెట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఉదయం 09:30 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఈ ఉద్యోగం ఎలా జరుగుతుందని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కొరకు అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9492158153 నెంబర్ను సంప్రదించాలన్నారు.
3. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 31 న నెల్లూరు జిల్లాలోని వి.ఆర్ కాలేజ్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డి మార్ట్ కంపెనీ నందు క్యాషియర్, గోదాము అసిస్టెంట్, సేల్స్ అసోసియేట్స్, ప్యాకర్స్ రైతులకు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ఈ ఉద్యోగాలకు పదవ తరగతి పాస్ నుండి డిగ్రీ వరకు విద్యార్హత కలిగి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు దాటని వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే యురేకా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నందు కస్టమర్ సర్వీసెస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ కు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని 18 నుండి 30 సంవత్సరాలు దాటని నిరుద్యోగ యువత అర్హులన్నారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నిరుద్యోగ యువతకు ఈనెల 31న జాబ్ మేలా pic.twitter.com/Q0MHcfS6nW
— Dasarath M (@LearningBADI) January 30, 2022
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కొరకు అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9177824585, 8639835953 నెంబర్లను సంప్రదించాలన్నారు.
4. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.మహా భాష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ జియో, చోళ ఎమ్మెస్ జనరల్ ఇన్సూరెన్స్, కాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హాజరవుతున్నట్లు వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాల కోసం మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఇంటర్, డిగ్రీ విద్యార్హత తోపాటు మార్కెటింగ్, సేల్స్, కాల్ సెంటర్ విభాగాల్లో అనుభవం కలిగిన వారు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.
డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీన ఉద్యోగ మేళా.. pic.twitter.com/aJDsV1Y5lI
— Dasarath M (@LearningBADI) January 30, 2022
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ ఉదయం 8:30 గంటలకు దరఖాస్తు ఫామ్ ఆధార్ కార్డుతో హాజరై తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9104943757, 998885335 నెంబర్లలో సంప్రదించాలని నిరుద్యోగ యువతకు సూచించారు.
💧ఇతర సంధెహాలకోసం: Comment 💬 చేయండి. elearningbadi.in మీ సంధెహాలకు స్పందిస్తుంది.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment