International Yoga day 2021 || జూన్ 21వ తేదీ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.
🧘♂️ జూన్ 21వ తేదీ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.?🧘♂️
🙏 జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. 2015వ సంవత్సరం నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ఉన్న ప్రజలు ఈ రోజున యోగా డేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈ సారి కూడా దీన్ని అట్టహాసంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు, వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా జనాలందరూ యోగా డేలో పాల్గొని తమకు వచ్చిన యోగాసనాలు వేశారు. అయితే మీకు తెలుసా..? జూన్ 21వ తేదీనే యోగా డేగా ఎందుకు నిర్ణయించారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… ఈ రోజున సహజంగానే పగటి సమయం ఎక్కువ. ఎందుకంటే , ఇదే రోజున దక్షిణాయనం ప్రవేశిస్తుంది. మరియు ఇదే రోజున శివుడు (ఆదిగురువు, ఆది యోగి) యోగా గురించిన విజ్ఞానాన్ని దేవతలకు వివరించాడట!. అందుకే ఈ రోజు నుండి యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా అనుకూలంగా ఉంటుందట. ఈ క్రమంలో జూన్ 21వ తేదీని వీటికి ఆరంభంగా భావిస్తారు. ఈ విషయాలను దృస్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ ఈ అంశాలను తెలియపరుస్తూ 27 సెప్టెంబర్ 2014వ తేదీన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించారు. కనుక ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని భారత ప్రతినిధి అశోక్ ముఖర్జీ 11 డిసెంబర్ 2014 న అదే ఐక్యరాజ్య సమితిలో ఓ డ్రాఫ్ట్ రిజల్యూషన్ పెట్టారు.
ఈ క్రమంలో డ్రాఫ్ట్ రిజల్యూషన్కు అనుకూలంగా 177 దేశాలకు చెందిన ప్రతినిధులు సమర్దించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలనే విషయాన్ని పలుదేశాల ప్రతినిధిలు సమర్థించారు. దీంతో ఇక ఆ తరువాత ఏడాది అంటే 2015 నుంచి జూన్ 21వ తేదీను ఇంటర్నేషనల్ యోగా డేను నిర్వహిస్తూ వస్తున్నారు. అదీ… ఈ, జూన్ 21 వ తేదీ రోజున యోగా డే పెట్టడం వెనుక ఉన్న అసలు కథ. ఈ క్రమంలో ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు యోగా డేను నిర్వహిస్తున్నారు..!🙏.
యోగా ఒక కల్పవృక్షం పిడిఎఫ్ బుక్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.
మరికొన్ని ఆసక్తికర విషయాలు:
☀జూన్ 21, సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు☀
👉జూన్ 21, సంవత్సరం లో పగటిపూట అధికంగా ఉన్న రోజు. ఈ వెలుతురు తేడాలను భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్లే కొలది బాగా స్పస్టంగా గమనించవచ్చు.
👉కానీ ఉత్తర ధృవం వైపు వెళ్లే కొద్దీ అంటే కర్కాటక రేఖ 23.5 డిగ్రీలు భూమధ్య రేఖ నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఉంటే కర్కాటక రేఖ దాటి పైన ఉన్న ప్రాంతాల్లో ఉదయం పూట చాలా ఎక్కువ గా ఉంటుంది. ఎంత అంటే ఉత్తర ధృవం వద్ద దాదాపు 24 గంటలు పగలే. అందుకే ఇప్పుడు ఉత్తర భూభాగాల్లో ఉన్న దేశాల్లో ఎండాకాలం.
👉దీనికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది దక్షిణ ధృవం అంటార్కిటికా వద్ద. (అంటే ఇప్పటి నుండి చలికాలం మరియు చీకటి)
👉డిసెంబర్ 22 నాటికి భూమి తిరగటం వలన ఈ వాతావరణంలో మార్పులు ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. అనగా ఉత్తర ధృవంలో చలికాలం మరియు చీకటి; దక్షిణ ధృవంలో ఎండాకాలం మరియు వెలుతురు.
👉ఈ సీజనల్ తేడా లకు కారణం భూమి కక్ష్య 23.5 డిగ్రీలు వంగి ఉండటమే.
👉అందుకే కదా మనం కర్కాటక రేఖ,మకర రేఖ లకు 23.5 డిగ్రీ గుర్తు గా భూమిని విభజించి పేరు పెట్టినాము.
👉ఈ రేఖల మధ్య లో మాత్రమే సూర్య కిరణాలు ఖచ్చితంగా నిటారుగా పడతాయి.
ఈ రేఖలకు పైన, కింద ఎప్పటికీ కిరణాలు నిటారుగా పడవు.
Comments
Post a Comment