Income Tax Department Govt. of India నుండి శుభవార్త! | పాన్-ఆధార్ గడువు మరో 3 నెలలు పెంపు | మీ పాన్ తో ఆధార్ ను నిముషం లో లింక్ చేయండిలా..
పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి జూన్ 30 దాకా డెడ్ లైన్ ను పొడిగించిన Income Tax Department Govt. of India.
పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాస్)తో ఆధార్ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్ లైనను కేంద్రం.. మరొకసారి మూడు నెలల పాటు పొడిగించింది. దీనికి సంభందించిన విషయాన్ని(సీబీడీటీ) ఒక ప్రకటనలో ట్విటర్ ద్వారా తెలిపింది. జూన్ 30 దాకా డెడ్ లైన్ పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిన్న సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాస్)తో ఆధార్ను అనుసంధానించేందుకు ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31, 2021. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్' గడువు మార్చి 31, 2021 తో ముగిసింది. వాస్త వానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు.
అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్ లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరే షన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్స భకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 58,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధారో అనుసంధానించారు.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి. ముందు ఈ వీడియొ ను తప్పక చూడండి.
👉సులభంగా లింక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment