IBPS PO MT Recruitment 2021 | Apply 4135 Vacancies Across National Banks of India | Check Eligibility Criteria and Apply Online here...
డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కు భారీ నోటిఫికేషన్ విడుదల..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో భాగంగా గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IBPS తాజాగా నాలుగు వేల 135 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 10, 2021 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు..
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు:
1. విద్యార్హత
2. వయసు
3. ఎంపిక విధానం
4. పరీక్ష విధానం
5. దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలను ఈ పేజీ నుంచి చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు..
నోటిఫికేషన్:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2022-23 సంవత్సరానికి గానూ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భారతదేశంలోని వివిధ జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న నాలుగు వేల 135 ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ ల భర్తీ కి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది..
ఈ కామెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగస్వామ్యం అవుతున్న బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:
1. బ్యాంక్ ఆఫ్ ఇండియా - 588,
2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - 400,
3. కెనరా బ్యాంక్ - 650,
4. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 620,
5. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 98,
6. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 427,
7. యూకో బ్యాంక్ - 440,
8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 912.. ఇలా మొత్తం నాలుగు వేల 135 ఖాళీలను ప్రకటించారు.
రిజర్వేషన్ల ఆధారంగా ఖాళీల వివరాలు:
1. ఎస్సీ - 679,
2. ఎస్టి - 350,
3. ఓ బి సి - 1102,
4. ఈ డబ్ల్యూ ఎస్ - 404,
5. ఆన్ రిజర్వడ్ - 1600.. ఖాళీలు ఉన్నాయి..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ 4135 పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు..
వయసు: అక్టోబర్ 1, 2021 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అర్హులు..
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ ఈ పేజి చివరలో ఉన్నాయి చూడండి..
ఎంపిక విధానం: బ్యాంక్ కొలువుల కు సంబంధించిన ఎంపికలు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
రాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్లు:
తెలుగు రాష్ట్రాల వారికి పరీక్ష సెంటర్లను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు.
తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
💧ఈ పరీక్షలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
💧ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
💧ప్రశ్నపత్రం మొత్తం 3 విభాగాలుగా ఉంటుంది.
1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు.
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు.
3. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు.. ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
💧పరీక్ష సమయం 60 నిమిషాలు.
💧ప్రశ్నపత్రం హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.
💧నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
💧ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
ఈ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష ప్యాట్రన్:
💧ఈ పరీక్ష కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు.
💧మెయిన్ పరీక్ష మొత్తం 225 మార్కులకు ఉంటుంది.
💧ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమంలో ఉంటుంది.
💧పరీక్ష పేపర్ రెండు విభాగాలుగా ఉంటుంది.
అవి; 1. ఆబ్జెక్టివ్ టైప్, 2. డిస్క్రిప్టివ్ టైప్.
ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష పేపర్:
💧ఈ పేపర్ లో నాలుగు విభాగాలుగా నుండి ప్రశ్నలు అడుగుతారు.
1. రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ నుండి 40 ప్రశ్నలు.
2. జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు.
3. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 ప్రశ్నలు.
4. డాటా అనాలసిస్ మరియు ఇంటరాక్షన్ నుండి 35 ప్రశ్నలు... ఇలా మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.
💧పరీక్ష సమయం 3 గంటలు.
డిస్క్రిప్టివ్ పరీక్ష ప్యాట్రన్:
💧ఇంగ్లీష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్& వ్యాసం) ల నుండి రెండు ప్రశ్నలు అడుగుతారు.
💧వీటికి 25 మార్కులు ఉంటాయి.
💧పరీక్ష సమయం 30 నిమిషాలు.
💧నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
💧ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
ఈ మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అంతిమంగా ఇంటర్వ్యూలనూ 100 మార్కులకు నిర్వహిస్తారు.
💧ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
💧ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యుడి అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే బ్యాంకులు సాధించినట్లే...
దరఖాస్తు ఫీజు:
💧జనరల్ లకు రూ.850/-.
💧ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.175/-.
నోటిఫికేషన్ పూర్తి వివరౌ వీడియొ లో..👇
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
💧ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2021 నుండి
💧ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2021.
💧ఆన్లైన్ ప్లీనరీ పరీక్ష: 04.12.2021 మరియు 11.12.2021.
💧ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష: జనవరి 2022.
అధికారిక వెబ్సైట్: https://ibps.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/crppo11jul21/
Comments
Post a Comment