Job Mela | రేపే తెలంగాణలో భారీ జాబ్ మేళా | 15కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు ఆహ్వానం | రిజిస్టర్ అవండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏప్రిల్ 3న ఆదివారం నాడు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ టిపిసిసి చైర్మన్ మదన్మోహన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వివిధ జాబ్ మేళా ప్రకటనలు వెలువడినాయి. పలురకాల మల్టీనేషనల్ కంపెనీలు కరోనా తర్వాత భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ సంస్థలైన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు సైతం జాబ్ మేళా ప్రకటనలు ఇచ్చి అవకాశాలను అందిస్తున్నాయి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐ టి ఐ, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, డిప్లమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయసు: 18 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకొని, నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
రిజిస్ట్రేషన్ లో భాగంగా సమర్పించాల్సిన వివరాలు:
పేరు, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, విద్యార్హత వివరాలు నమోదు చేసి, అదేవిధంగా రెజ్యూమ్ కూడా నమోదు చేయాలని, సూచించారు.
ఇంటర్వ్యూ వేదిక: పార్సీ రాములు కళ్యాణమండపం, కామారెడ్డి.
తేదీ మరియు సమయం: ఏప్రిల్ 3, 2022 ఉదయం 10 గంటలనుండి.
రిజిస్ట్రేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment