PM Care For Childrens | Apply online to Enroll and Get benifities | check eligibility here..
కరోనాతో అనాథలైన చిన్నారుల సంరక్షకులు కలెక్టర్లే అని తేల్చి చెప్పిన మహిళా శిశు సంక్షేమ శాఖ..
పీఎంకేర్స్ మార్గదర్శకాల జారీ
డిసెంబరు 31 వరకు దరఖాస్తుకు అవకాశం
అదికారిక వెబ్ సైట్ :: https://pmcaresforchildren.in/
మహమ్మారి కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఆనాదులైన చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్మాకంగా ప్రవేశ పెట్టిన పీఎంకేర్స్ప థకానికి కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
అర్హులు డిసెంబరు 31 వరకు అదికారిక పోర్టల్ లో https://pmcaresforchildren.in/ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ పథకం పిల్లలకు 28 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతుంది.
లబ్దిదారులైన పిల్లల పేరిట పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరుస్తారు.
వారికి 18 సంవత్సరాలు వచ్చే నాటికి రూ. 10 లక్షలు అయ్యేలా కార్పస్ ఫండ్ జమచేస్తారు.
ఉదాహరణకు ఓ చిన్నారికి 6 సంవత్సరాలు వయసు ఉంటే ఇప్పుడు రూ.4,15,200, 16 సంవత్సరాల వయసుంటే రూ.8,68,780 లక్షలు ఖాతాలో వేస్తారు. 1
8 సంవత్సరాలు నిండిన తరువాత ఆ నిధిని పెట్టు బడిగా పెట్టి విద్యార్థికి స్టయిపెండ్ గా అందిస్తారు.
వారికి 28 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత రూ.10 లక్షలు ఇస్తారు.
18 సంవత్సరాలు లోపు పిల్లలకు జిల్లా కలెక్టర్తో కలిసి జాయింట్ ఖాతా తెరుస్తారు. 'ఇప్పటివరకూ స్టయి పెండ్ గరిష్ఠంగా రూ.2 వేలు అందించాలని నిర్ణయించగా, దాన్ని రూ.4 వేలకు పెంచే అవకాశం ఉంది' అని మహిళ, శిశు అభివృద్ధి మంత్రి త్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment