Parakram Diwas 2021 | పరాక్రమ దివాస్ గా నేతాజీ జయంతిను ప్రకటించిన భారత ప్రభుత్వం. పూర్తి వివరాలు చదవండి.
'పరాక్రమ దివాస్' గా నేతాజీ జయంతిను ప్రకటించిన భారత ప్రభుత్వం.
కొంతమంది పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మరికొంత మంది పేర్లు వింటే శౌర్యంతో గుండె ఉప్పొంగుతుంది అలాంటి నేతలకు ప్రజలు హృదయాల్లో ప్రత్యక స్థానం ఉంటుంది. ఈ కోవకు చెందిన వారే నేతాజీ సుభాష్ చంద్రబోస్. దేశాన్ని బానిసత్వం నుంచి బయట పడేయడానికి బ్రిటిష్ వారితో సుదీర్ఘ సాయుధ పోరాటాన్ని నడపడానికి సిద్ధమని ప్రకటించి, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపించారు. నేతాజీ స్వతంత్ర భారతాన్ని చూడకుండానే అదృశ్యమయ్యారు, కానీ స్వతంత్రం తరువాత వచ్చిన భారత ప్రభుత్వాలు నేతాజీ ని సరిగ్గా పట్టించుకోలేదనే చెప్పాలి. అలాంటి జన నేతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నేతాజీ పుట్టిన రోజు జనవరి 23న జాతీయ పరాక్రమ దివాస్ గా సోమవారం (02.08.2021) ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. 2021 జనవరి 23న నేతాజీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ కోల్కత్తా వెళ్లి నేతాజీ కి నివాళులు అర్పించారు. ఎల్జిన్ రోడ్ లో ఉన్న విక్టోరియా భవన్ కు నేతాజీ భవన్ గా నామకరణం చేసి, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పేరుతో ఒక ఎగ్జిబిషన్ కూడా ఆ సందర్భంగా ఆయన ప్రారంభించారు. అలాగే నేతాజీ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ తపాల బిళ్ళను కూడా ఆవిష్కరించారు.
మీరెలా మాకు స్వతంత్రం ఇచ్చారు: బ్రిటన్ మాజీ ప్రధాని గవర్నర్ ప్రశ్న?.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1956లో భారతదేశాన్ని, అప్పటి మాజీ బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన బెంగాల్ వెళ్లారు. అప్పటి బెంగాల్ గవర్నర్, కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ పిబి చక్రవర్తి. అట్లీ 1945 చివర నుంచి 1951 వరకు లేబర్ పార్టీ చీప్ గా, బ్రిటన్ ప్రధానిగా ఉన్నారన్న ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, మన దేశానికి ఏ కారణం చేత స్వాతంత్ర్యం ఇచ్చారని ఆయన్ని ఓ ప్రశ్న అడిగారట? దానికి సమాధానంగా అట్లీ... సుభాష్ చంద్రబోస్ వల్లే మేము ఇండియాను అర్థంతరంగా వదిలి వెళ్ళమని, అప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వానికి వినయంగా ఉన్న రాయల్ ఇండియన్ ఆర్మీ, రాయల్ నేవీ నేతాజీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభించాయి చెప్పారట. దానికి సంబంధించిన కీలక సమాచారం నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించాలని వెల్లడించారు అట. అందుకే ఉన్నపళంగా భారత్ ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారని పి బి చక్రవర్తి అప్పటి సమాచారాన్ని ఓ లేఖ రూపంలో ఓ చరిత్ర పరిశోధకుడికి పంపించారు.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment