JOB Alert 2022 | ఈనెల 13న తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగమేళా | పూర్తి వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ - ఉద్యోగమేళా, ఉచిత శిక్షణ, సాంకేతిక శిక్షణ వివరాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా (PMNAM):
భారత ప్రభుత్వానికి చెందిన, శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్రాలలో అనుకూలతలను అనుసరించి, అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, నోటిఫికేషన్లను ప్రకటించాలని అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర, జిల్లా సంబంధిత శాఖ అధికారులు.. అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రకటనను విడుదల చేశారు.. ఈ ఉద్యోగమేళా లు నిర్వహిస్తున్న కేంద్రాలు, విద్యార్హత, ఇంటర్వ్యూలకు పాల్గొనే అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం, సమయం తేదీ, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
సంభందిత ఆర్డర్ కోఫీ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఖమ్మంలో ఈ నెల 13న జాబ్ మేళా:
నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న అప్రెంటిస్షిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్సీ కంపెనీలతో పాటు స్థానిక కంపెనీలు ఈ ఉద్యోగమేళా లో పాల్గొని అభ్యర్థులను అప్రెంటిస్షిప్, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని ఆయన నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.
అర్హత ప్రమాణాలు:
8వ తరగతి/ 10వ తరగతి/ ఏదైనా ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు, నేరుగా మీ ఉద్యోగమే లకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ లో, ఈ నెల 13 న, ఉదయం 10:00 గంటల నుండి..
కొత్తగూడెంలో అప్రెంటిస్షిప్ మేళా:
కొత్తగూడెం ప్రభుత్వ ఐటిఐ లో జూన్ 13న ITI పాసైన అన్ని ట్రేడ్ ల అభ్యర్థులకు జిల్లా పరిధిలో గల వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం PM జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
ITI పాసైనవారు, www. apprenticeshipindia.org.in వెబ్సైట్ లో తమ పేర్లను వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత బయోడేటా ఫామ్, విద్యార్హత ధ్రువపత్రాల కాఫీలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: ఉచిత శిక్షణ లకు దరఖాస్తులు ఆహ్వానం.
కొత్తగూడెం: పాల్వంచలోని నవభారత్ ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో నిరుద్యోగులకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం కె. అజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి లేదా ఐటిఐ ఉత్తీర్ణులైన 18 నుండి 25 సంవత్సరాల వయసు మించకుండా ఉన్నవారు ఈ సాంకేతిక శిక్షణ లకు దరఖాస్తులు చేయవచ్చునని ప్రకటనలో తెలిపారు.
శిక్షణా కాలంలో ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు నిరుద్యోగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ - ఉద్యోగమేళా, ఉచిత శిక్షణ, సాంకేతిక శిక్షణ వివరాలకోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment