POWERGRID Diploma trainee Recruitment 2021 || పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లమా ట్రెయినీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నార్తన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం (ఎలక్ట్రికల్/ సివిల్) ఈ విభాగంలో డిప్లమా ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 35 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. డిప్లమా ట్రెయినీ/ఎలక్ట్రికల్) విభాగంలో - 30,
2. డిప్లమా ట్రెయినీ సివిల్ విభాగంలో - 5.
విద్యార్హత:
★ డిప్లమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ విభాగంలోనే పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 70 శాతం మార్కులతో ఫుల్ టైమ్ రెగ్యులర్ మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి అభ్యర్థులు పాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
అధిక విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు, అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
★ డిప్లమా ట్రైనింగ్ సివిల్ విభాగంలోనే పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 70 శాతం మార్కులతో ఫుల్ టైమ్ రెగ్యులర్ మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ అభ్యర్థులు పాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
అధిక విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు, అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: 15.06.2021 నాటికి
●జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ లకు 27 సంవత్సరాలు,
● ఓబీసీలకు 30 సంవత్సరాలు,
● ఎస్సీ ఎస్సీలకు 32 సంవత్సరాల కు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష మాత్రమే నిర్వహించే అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారని పేర్కొన్నారు.
రాత పరీక్ష పార్ట్-1, పార్ట్-2 రెండు విభాగాలుగా ఉంటుందని,
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కును కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాత పరీక్ష అర్హత :
●అన్ రిజర్వుడ్ / ఈ డబ్ల్యూఎస్ వారు రాత పరీక్షలో అర్హత సాధించాలంటే 40% మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్-1, పార్ట్-2 లలో విడివిడిగా కనీసం 30% స్కోర్ చేయాలి.
● రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు రాత పరీక్షలో అర్హత సాధించాలంటే 30% మార్కులు స్క్వేర్ చేయాల్సి ఉంటుంది.పార్ట్-1, పార్ట్-2 లలో విడివిడిగా కనీసం 25% చేయాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
Comments
Post a Comment